870 టీచర్ పోస్టులు తరలింపు
తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేని చోట ఉన్న టీచర్పోస్టులను తొలగించి.. అవసరమున్న చోటకు మారుస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రంలో పలు పాఠశాలలు ప్రాథమిక నుంచి ప్రాథమికోన్నత, ప్రాథమికోన్నత నుంచి ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరణ చెందాయి. అలాంటి చోట్లవిద్యార్థులు ఎక్కువగా ఉన్నా కానీ టీచర్లను కేటాయించాలంటే పోస్టులు లేవు.అలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ప్రయోజనార్థం ఇటీవలడీఎస్సీ-2024లో ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్లు ఇచ్చారు. ఈక్రమంలో డీఈవోలు సమర్పించిన జాబితా మేరకు మొత్తం 870 పోస్టులనుఇతర చోట్లకు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
please do not enter any spam link in the coment box.